'విద్రోహ' వ్యాఖ్యలపై రాంగోపాల్ యాదవ్ విచారం

3 Nov, 2014 19:25 IST|Sakshi
'విద్రోహ' వ్యాఖ్యలపై రాంగోపాల్ యాదవ్ విచారం

లక్నో: లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ ఓటమిక కారణమైన వారు విద్రోహులంటూ తాను చేసిన వ్యాఖ్యలపై సమాజ్వాదీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంగోపాల్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. తాను పొరపాటున ఈ మాట అన్నానని ఒప్పుకున్నారు. విద్రోహులు అన్న మాట అనునుండాల్సింది కాదని పేర్కొన్నారు.

లోక్సభ ఎన్నికల్లో కొంత మంది కార్యకర్తలు పార్టీకి సహకరించలేదని, వీరంతా విద్రోహులని అంతకుముందు ఆయన వ్యాఖ్యానించారు. 80 లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన సమాజ్వాదీ పార్టీ కేవలం 5 చోట్ల మాత్రమే గెలిచింది. 

పార్టీ ఓటమిపై  26 జిల్లాల్లో సమీక్షలు నిర్వహించిన పరిశీలకులు నివేదికను సోమవారం రాంగోపాల్ యాదవ్ కు అందజేశారు. పరిశీలకులు ఇచ్చిన నివేదిక సంతృప్తికరంగా ఉందా, లేదా అనేది తర్వాత తెలుస్తుందన్నారు.

మరిన్ని వార్తలు