పార్టీకి తలవంపులు తెస్తున్నారు: కేజ్రీవాల్

24 Sep, 2015 02:46 IST|Sakshi

న్యూఢిల్లీ: గృహహింస ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ మాజీ మంత్రి సోమ్‌నాథ్ భారతీ వ్యవహారంపై ముఖ్యమంత్రి అరవింద్‌కేజ్రీవాల్ ఎట్టకేలకు మౌనం వీడారు. సోమ్‌నాథ్ వ్యవహారం ఆయన కుటుంబా నికీ, ఆమ్‌ఆద్మీపార్టీకి తలవంపులు తెచ్చిపెడుతోందని కేజ్రీవాల్ బుధవారం ట్విటర్ లో వ్యాఖ్యానించారు. భారతీ పోలీసులను ఎందుకు తప్పించుకు తిరుగుతున్నారో, జైలుకు పోవటానికి ఎందుకు భయపడుతున్నారో అర్థం కావటం లేదన్నారు.  కాగా, తనను అరెస్టు చేయకుండా ఢిల్లీ పోలీసులను ఆదేశించాలంటూ సోమ్‌నాథ్ భారతీ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు.

మరిన్ని వార్తలు