వైరస్‌ను తట్టుకునే బొప్పాయి!

23 Apr, 2015 00:47 IST|Sakshi

బొప్పాయి సాగు చేస్తూ పపయా రింగ్‌స్పాట్ వైరస్(పీఆర్‌ఎస్‌వీ)తో సతమతమవుతున్న రైతులకు శుభవార్త. ఈ వైరస్‌ను చాలా వరకు తట్టుకునే రెండు వంగడాలు అందుబాటులోకి వచ్చాయి. పుణే (మహారాష్ట్ర)లోని భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐఏఆర్‌ఐ) శాస్త్రవేత్తలు పుణే సెలక్షన్-1, పుణే సెలక్షన్-3 అనే రెండు రకాల బొప్పాయి వంగడాలను రూపొందించారు. ఈ వంగడాలకు వైరస్ త్వరగా సోకదని, ఒకవేళ సోకినా నష్టం చాలా తక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

దేశంలోని వివిధ ప్రాంతాల రైతులకు ఈ విత్తనాలను పరీక్షల నిమిత్తం పుణేలోని ఐఏఆర్‌ఐ ఉచితంగా అందిస్తోంది. ప్రయోగాత్మకంగా సాగు చేయదలచిన రైతులు సంప్రదించాల్సిన చిరునామా: డా. ఎస్.కె.శర్మ, అధిపతి, ఐఏఆర్‌ఐ, ఫోన్: 020-25889968, ఫాక్స్: 020-25889969. జ్ఛ్చిఛీచిఞఠ్ఛఃజ్చీటజీ.ట్ఛట.జీ పుణే ఐఏఆర్‌ఐ నుంచి సికింద్రాబాద్‌లోని ‘సుస్థిర వ్యవసాయ కేంద్రం’ ఈ విత్తనాలు కొన్నిటిని తెప్పించి ఇస్తోంది. ఆసక్తి గల వారు 040-27017735 నంబరులో సంప్రదించవచ్చు.

మరిన్ని వార్తలు