పరవాడలో భారీ ప్రమాదం

30 Dec, 2017 11:36 IST|Sakshi

సాక్షి, విశాఖ: విశాఖ జిల్లా పరవాడ మండలంలోని ఓ ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న కొరియ ఆర్గాన్స్‌ కంపెనీలో శనివారం రియాక్టర్‌ పేలింది. దీంతో మంటలు భారీగా ఎగసిపడ్డాయి.

ఈ ప్రమాదంలో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు