సాక్షి, మైదుకూరు: వైఎస్సార్ కడప జిల్లాలో మైదుకూరులో సోమవారం పోలీసుల ఓవరాక్షన్ చేశారు. ఈ రోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా 'వాక్ విత్ జగన్' కార్యక్రమం నిర్వహించారు. ఇందుకోసం బైక్ ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదంటూ ఫైన్ విధించారు. అయితే పోలీసుల ఓవర్ యాక్షన్పై ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అసహం వ్యక్తం చేశారు. అన్యాయంగా కార్యకర్తలకు ఫైన్ వేశారని మండిపడ్డారు.