మైదుకూరులో పోలీసుల ఓవరాక్షన్‌

29 Jan, 2018 14:24 IST|Sakshi

సాక్షి, మైదుకూరు: వైఎస్సార్ కడప జిల్లాలో మైదుకూరులో సోమవారం పోలీసుల ఓవరాక్షన్ చేశారు. ఈ రోజు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్పయాత్రకు మద్దతుగా 'వాక్ విత్ జగన్' కార్యక్రమం నిర్వహించారు. ఇందుకోసం బైక్‌ ర్యాలీ నిర్వహించిన వైఎస్‌ఆర్సీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదంటూ ఫైన్ విధించారు. అ​యితే పోలీసుల ఓవర్‌​ యాక్షన్‌పై ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అసహం వ్యక్తం చేశారు. అన్యాయంగా కార్యకర్తలకు ఫైన్‌ వేశారని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు