క్షణికావేశంలో వివాహిత తీవ్ర నిర్ణ‌యం!

8 Dec, 2023 09:03 IST|Sakshi
కవిత (ఫైల్‌)

సాక్షి, ఆదిలాబాద్‌: క్షణికావేశంలో పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ముత్నూర్‌లో చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు, ఎస్సై దు బ్బాక సునీల్‌ తెలిపిన వివరాల ప్రకారం బోథ్‌ మండలంలోని వజ్జర గ్రామానికి చెందిన కవిత (26)కు ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్‌ గ్రామానికి చెందిన గేడం జ్యోతిరాంతో 2021 లో వివాహమైంది.

గురువారం ఉదయం జ్యోతిరాం మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. క్షణికావేశంలో కవిత ఇంట్లో ఉన్న గుర్తు తెలియని పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి త రలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతురాలు తండ్రి సిడాం లక్ష్మణ్‌ ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

ముఖ్య గమని​క: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

>
మరిన్ని వార్తలు