రాజవొమ్మంగి: పోలీసు అని చెప్పి మోటారు సైకిళ్లను చోరీ చేస్తున్న వేళంగి గ్రామానికి చెందిన వెలుగుల వెంకటరమణ అనే వ్యక్తిని సోమవారం అరెస్టు చేసినట్టు ఎస్ఐ జి.ఎన్.ప్రసాద్ తెలిపారు. ఈ నెల 23న స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహం వద్ద టూవీలర్తో పరారైన నిందితుడిని అరెస్టు చేసి రంపచోడవరం జేఎఫ్సీఎం కోర్టులో హాజరుపరిచినట్టు చెప్పారు. కాగా వెంకటరమణ ఇదే తరహాలో కాకినాడ, నక్కపల్లి, శ్రీకాకుళం, ఏలూరు, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో నేరాలు చేసి, జైలు శిక్షణ అనుభవించాడని ఎస్ఐ తెలిపారు.