లారీ, బైక్‌ ఢీ

29 Mar, 2023 01:24 IST|Sakshi
ఘటనా స్థలంలో వెంకటేష్‌ మృతదేహం
యువకుడి దుర్మరణం

ఎటపాక: మండలంలోని లక్ష్మీపురం జాతీయ రహదారి– 30లో లారీ, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో యువకుడు దుర్మరణం చెందాడు. గొమ్ముకోయగూడెం గ్రామానికి చెందిన మడకం వెంకటేష్‌ (29) తన ద్విచక్ర వాహనంపై నెల్లిపాక నుంచి చింతూరు వెళ్తున్నాడు. ఈ క్రమంలో చింతూరు వైపు నుంచి భద్రాచలం వెళ్తున్న ఐరన్‌లోడ్‌ లారీ (టీన్‌16బీ9127) లక్ష్మీపురం గ్రామం వద్ద ఎదురుగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటేష్‌ తల నుజ్జునుజ్జు కావటంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు