ఏయూక్యాంపస్: ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల పూర్వ విద్యార్థి దేవ పురాణం విరాళంగా అందించిన రూ.50 లక్షలతో నిర్మించిన హాస్టల్ భవనం అందుబాటులోకి వచ్చింది. తన తల్లిదండ్రులు ‘లలితాదేవి పురాణం–కోటిలింగ మూర్తి పురాణం’పేరుతో చదువుకున్న కళాశాలకు ఈ మొత్తం అందించగా.. ఫార్మసీ కళాశాలకు అనుకుని విద్యార్థినులకు హాస్టల్ భవనం నిర్మించారు. ఈ హాస్టల్ భవన సముదాయాన్ని శుక్రవారం ఏయూ వీసీ ఆచార్య పి.వి.జి.డి ప్రసాదరెడ్డి సమక్షంలో దేవ పురాణం ప్రారంభించారు. వీసీ మాట్లాడుతూ పూర్వ విద్యార్థిని ప్రశంసించారు.
ఏయూ ఫార్మసీ కళాశాల హాస్టల్నిర్మాణానికి రూ.50 లక్షల విరాళం