ఏపీ: 24 గంటల్లో 8,473 మంది డిశ్చార్జ్‌

26 Aug, 2020 19:47 IST|Sakshi

సాక్షి, అమరావతి : గత 24 గంటల్లో 61,838 మందికి కరోనా వైరస్‌ పరీక్షలు చేయగా 10,830 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,82,469కు చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. కరోనా నుంచి కోలుకుని నిన్న ఒక్కరోజే 8,473 మంది డిశ్చార్జ్‌ అవ్వగా, మొత్తం 2,86,720 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 81 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 92,208 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకూ 34,18,690 మందికి కరోనా పరీక్షలు చేశారు. 

చదవండి : ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు

మరిన్ని వార్తలు