కులగణనకు ఏపీ కేబినెట్‌ ఆమోదం

3 Nov, 2023 19:45 IST|Sakshi

సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది. ఉదయం 11 గంటలకు సచివాలయంలోని మొదటి బ్లాక్‌ కేబినెట్‌ సమావేశ మందిరంలో ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. 

►ఎస్‌ఐపీబీ నిర్ణయాలకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.  
►కులగణనకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
► జగనన్న సురక్ష కార్యక్రమానికి కేబినెట్‌ అభినందనలు
►జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.
► ప్రతి జర్నలిస్ట్‌కు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని కేబినెట్‌ నిర్ణయించింది.

►అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత ఉపయోగపడుతుందన్న సీఎం జగన్‌
►మంత్రులందరూ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగస్వాములు కావాలి: సీఎం జగన్‌ 
►నవంబర్‌ 15 నుంచి డిసెంబర్‌ 15 వరకు ఆరోగ్యశ్రీపై మరోసారి అవగాహన కార్యక్రమం.
►6, 790 ప్రభుత్వ స్కూళ్లలో ఫ్యూచర్‌ స్కిల్స్‌పై బోధన.
►క్రీడాకారుడు సాకేత్‌ మైనేనికి గ్రూప్‌-1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం.
►ఫెర్రోఅలైస్‌ కంపెనీలకు ఎలక్ట్రిసిటీ చార్జీలు మినహాయింపు.
►దీంతో ప్రభుత్వంపై రూ. 766 కోట్ల భారం.
►50 వేల మంది కార్మికులు ఆధారపడినందుకు నిర్ణయం తీసుకున్నాం.

మరిన్ని వార్తలు