ఏపీలో కొత్తగా 6,096 కరోనా కేసులు!

16 Apr, 2021 19:24 IST|Sakshi

అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 35,962 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,096 కరోనా పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, కరోనా వలన  20 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 2,194 మంది క్షేమంగా కొలుకున్నారు.  ఇప్పటి వరకు ఏపీ రాష్ట్రంలో మొత్తంగా..  9 లక్షల 5వేల 266 మంది కరోనా నుండి కోరుకుని క్షేమంగా డిశ్చార్జ్‌ అయ్యారు. 

ప్రస్తుతం 35,592 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,56,06,163 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.  ఈమేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ శుక్రవారం కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. 

మరిన్ని వార్తలు