మహానేత వైఎస్సార్‌కు గవర్నర్‌ విశ్వభూషణ్‌ నివాళి

2 Sep, 2021 13:14 IST|Sakshi

సాక్షి, అమరావతి: మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ నివాళులర్పించారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఆ మహానేత తన జీవితాన్ని ప్రజల సంక్షేమానికి అంకితం చేశారన్నారు. ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, 104 ఆరోగ్య సేవల నుంచి ఇతర రాష్ట్రాలు కూడా స్ఫూర్తి పొందాయని గవర్నర్‌ ట్వీట్‌ చేశారు.

ఇవీ చదవండి:
మీ స్ఫూర్తి ముందుండి నడిపిస్తోంది నాన్న: సీఎం జగన్‌ భావోద్వేగ ట్వీట్‌ 
వైఎస్సార్ ఆచరణలో నుంచి ఓ మహావృక్షం పెరిగింది: సజ్జల

మరిన్ని వార్తలు