ఏపీ సంక్షేమ పథకాలపై ‘ఐరాస’లో చర్చ

22 Sep, 2023 03:34 IST|Sakshi
ఐరాస సదస్సు ప్రాంగణంలో ‘న్యూస్‌ వీక్‌’ సీనియర్‌ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ సర్గోన్‌తో ఏపీ విద్యార్థులు

ప్రపంచ దేశాలకు దిశ చట్టాన్ని వివరించిన రాష్ట్ర ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు

సాక్షి, అమరావతి: అమెరికా వెళ్లిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభు­త్వ పాఠశాలల విద్యార్థులు తాజాగా ఐక్యరా­జ్య­సమితి జనరల్‌ అసెంబ్లీ 78వ సదస్సులో పాల్గొ­న్నారు. 27 దేశాలకు చెందిన గ్లోబల్‌ పార్టనర్లు, ప్ర­పంచ దేశాల నాయకులు, దౌత్యవేత్తలు, పౌర సమాజ సభ్యులను ఒక్కతాటిపైకి తెచ్చేందుకు న్యూ­యా­ర్క్‌లో నిర్వహించిన హైబ్రిడ్‌ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ గోల్స్‌ కాన్ఫరెన్స్‌–2023లో ఏపీ ప్ర­భు­త్వ స్కూళ్ల విద్యార్థులు ప్రసంగించారు.

ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అటు ప్రజలకు, ఇటు విద్యార్థుల ప్రగతికి ఏవిధంగా ఉపయోగప­డు­తున్నాయో వివరించారు. మహిళల భద్రత కోసం సీఎం జగన్‌ తీసుకువచ్చిన దిశ చట్టం గురించి తెలి­యజేశారు. కాగా, ప్రపంచ శాంతి, మానవ హక్కు­లు, స్థిరమైన అభివృద్ధిపై జరిగిన ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా 150 మంది ఉన్నత స్థాయి స్పీకర్లను ఒక్కచోటకు చేర్చి ఇంటర్‌ డిసిప్లినరీ గ్రూపు­లను ఏర్పాటు చేశారు.

సుస్థిరా­భివృద్ధి లక్ష్యా­లను సమర్థవంతంగా అమలు చేసేందుకు తీసుకో­వాల్సిన చర్యలపై చర్చించారు. సదస్సులో జర్న­లిస్ట్స్‌ అండ్‌ రైటర్స్‌ ఫౌండేషన్‌ సభ్యులతో పాటు వివిధ దేశాల ప్రతినిధులు, ఐక్యరాజ్య­సమితి స్పె­షల్‌ స్టేటస్‌ మెంబర్‌ ఉన్నవ షకిన్‌ కుమార్, సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు