65.33 లక్షల మందికి రూ.1,800.96 కోట్లు

1 Dec, 2023 05:17 IST|Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65,33,781 మంది అవ్వాతాతలు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, వివిధ రకాల చేతి వృత్తిదారులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు డిసెంబర్‌ 1న ఠంచన్‌గా వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1,800.96 కోట్లు విడుదల చేసింది. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల­నాయుడు గురువారం పేర్కొన్నారు. పింఛన్‌ నగదు­ను ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలకు పంపించినట్లు చెప్పారు. సచివాలయాల వలంటీర్లు శుక్ర­వారం తెల్లవారుజాము నుంచే లబ్ధిదారుల ఇళ్ల వద్ద­కు వెళ్లి పింఛన్‌ సొమ్మును అందజేస్తారని తెలిపారు. ఇందుకోసం 2.66 లక్షల మంది వలంటీర్లు సిద్ధంగా ఉన్నారన్నారు.

లబ్ధిదారులకు పింఛన్‌ అందజేసే సందర్భంలో గుర్తింపు కోసం ఆధార్‌ నిర్ధారిత బయో­మెట్రిక్, ఐరిస్‌ తదితర విధానాలను అమలు చేస్తు­న్నా­మన్నారు. సాంకేతిక కారణాల వల్ల ఏ ఒక్కరికీ పింఛన్‌ అందలేదనే ఫిర్యాదు రాకుండా.. అన్ని జా­గ్రత్తలు తీసుకుంటామని తెలిపారు. ఐదు రోజుల్లోనే నూరు శాతం పింఛన్ల పంపిణీ పూర్తి అయ్యేలా చర్య­లు తీసుకున్నామని చెప్పారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రి­యలో 15 వేల మంది సంక్షేమ, విద్య అసిస్టెంట్, వార్డు సంక్షేమ అభివృద్ధి కార్యదర్శులు భాగస్వా­ములు అవుతారని వివరించారు. రాష్ట్రంలోని అన్ని డీఆర్‌డీఏ కార్యాలయాల్లోని కాల్‌ సెంటర్ల ద్వారా పింఛన్ల పంపిణీని పర్యవేక్షిస్తామని తెలిపారు.  

మరిన్ని వార్తలు