అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. గతంలో మంత్రులు ప్రమాణం చేసిన చోటే మళ్లీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దానిలో భాగంగా సచివాలయం పక్కన ప్రమాణస్వీకారాలకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ మేరకు ఏర్పాట్లను తలశిల రఘురాం, పొలిటికల్ సెక్రటరీ ముత్యాలరాజు పరిశీలించారు. ఏప్రిల్ 11వ తేదీన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.