గవర్నర్‌కు సీఎం జగన్‌ దీపావళి శుభాకాంక్షలు

13 Nov, 2020 11:17 IST|Sakshi

సాక్షి, విజయవాడ : రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌, వైఎస్‌ భారతిరెడ్డి శుక్రవారం ఉదయం రాజ్‌భవన్‌కు వెళ్లారు. హిందువులకు అత్యంత ప్రాశస్త్యమైన దీపావళి పండుగ సందర్భంగా సీఎం జగన్‌.. గవర్నర్‌కు శుభాకాంక్షలు తెలియచేశారు. అనంతరం రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, అమలవుతున్న సంక్షేమ పథకాలు తదితర అంశాలపై గవర్నర్‌తో ముఖ్యమంత్రి వివరించారు. అరగంటపాటు వీరి భేటీ జరిగింది.


 

మరిన్ని వార్తలు