సాక్షి, అమరావతి: ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమిని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారికి సీఎం జగన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దసరా. అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు, విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయదశమి శుభాంకాంక్షలు. #HappyDussehra
— YS Jagan Mohan Reddy (@ysjagan) October 15, 2021