ఏపీలో కొత్తగా 1221 కరోనా కేసులు

20 Nov, 2020 20:48 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 66,002 నమూనాలు పరీక్షించగా 1,221 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య8,59,932 కు చేరింది. కొత్తగా పది మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6,920 కి చేరింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 1,829 మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 15,382యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

మరిన్ని వార్తలు