ఏపీ, తెలంగాణాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల

9 Feb, 2023 12:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం గురువారం షెడ్యూల్‌ విడుదల చేసింది. ఏపీలో 8 స్థానిక సంస్థల నియోజకవర్గాలకు, 3  గ్రాడ్యుయేట్‌ స్థానాలకు, 2 టీచర్‌ ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో ఒక టీచర్‌ ఎమ్మెల్సీ స్థానానికి, మరో స్థానిక సంస్థల స్థానానికి ఎన్నిక జరగనుంది.

ఫిబ్రవరి 16న నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 16న కౌంటింగ్‌ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు. 

మరిన్ని వార్తలు