ఏపీలో 3 రైళ్ల గమ్యస్థానాల పొడిగింపు

12 Jan, 2024 05:10 IST|Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ)­/­లక్ష్మీ­పురం­(గుంటూరు వెస్ట్‌): ఏపీలోని పలు గమ్యస్థానాలకు అద­నపు ప్రయాణ సౌకర్యాన్ని అందించేందుకు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 3 రైళ్ల సర్వీసుల గమ్య­స్థానాలను రైల్వేశాఖ పొడిగించింది. వీటిలో గుంటూరు– విశాఖ (22701/22702) రైలు విశాఖ, విజయవాడ,గుంటూరు మీదుగా ప్రయా­ణిస్తోంది. మిగిలిన 2 రైళ్లు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభమవుతాయని తెలిపా­రు. వాటిలో నర్సాపూర్‌–­హుబ్లీ (17225/17226) రైలు గుడివా­డ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం, పాలకొల్లు స్టేషన్‌ల మీదుగా ప్రయాణిస్తుందని తెలిపారు.

నంద్యాల–రేణిగుంట (07285/­07284) రైలు ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, ఓబులవారిపల్లి, కోడూరు, కంభాలపల్లె స్టేషన్‌ల మీదుగా ప్రయాణిస్తుందని చెప్పారు. ఈ రైళ్ల సర్వీసులను శుక్రవారం కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రజాప్రతినిధుల సమక్షంలో గుంటూరు రైల్వే స్టేషన్‌లో జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ రైళ్లు శుక్రవారం నుంచే ప్రయా­ణికుల సేవల్లోకి అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.

>
మరిన్ని వార్తలు