తిరుమలలో చిరుత సంచారం

29 Aug, 2021 07:52 IST|Sakshi

తిరుమల: తిరుమలలోని శ్రీకృష్ణ అతిథిగృహం వద్ద చిరుత సంచరించిన ఘటన శనివారం వెలుగుచూసింది. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో అతిథిగృహం సమీపంలోకి ఓ వరాహం వచ్చింది. అదే సమయంలో వరాహాన్ని వెంబడిస్తూ చిరుత చేరుకుంది. కొంతసేపు వరాహం కోసం వేచి ఉన్న చిరుత అనంతరం అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోయింది. ఈ దృశ్యాలు అతిథి గృహంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఇప్పటివరకు కుక్కల కోసం తిరుమలలోని నివాసప్రాంతాలు, అతిథిగృహాల వద్దకు వస్తున్న చిరుతలు ప్రస్తుతం వరాహాల కోసం రావడం గమనార్హం.
 

>
మరిన్ని వార్తలు