కడుతున్న భవనాలు కనబడలేదా?

5 Nov, 2023 03:46 IST|Sakshi

విజయపురి సౌత్‌ ప్రభుత్వ ఆసుపత్రిపై రామోజీ వక్రరాతలు

30 పడకల ఆస్పత్రి శరవేగంగా నిర్మాణం

తాత్కాలికంగా ప్రభుత్వ భవనంలో వైద్య సేవలు

దుష్ప్రచారమే లక్ష్యంగా ఈనాడు కథనం

విజయపురిసౌత్‌ (మాచర్ల): రాష్ట్రంలో అద్భుతంగా వైద్యరంగాన్ని తీర్చి­దిద్దుతున్న వైఎస్సార్‌సీపీ ప్రభు­త్వ­ంపై బురద జల్లాలనే లక్ష్యంతో రామోజీ­రావు విష­పురాతలకు దిగుతున్నారు. అలాంటి ఓ కథ­నాన్ని ‘చెట్టుకింద వైద్యం’ శీర్షికతో తన ఈనాడు పత్రి­కలో ప్రచురించారు. వాస్తవం ఏంటంటే.. పల్నాడు జిల్లా మాచర్ల మండలంలో చివరి సరి­హద్దు గ్రామమైన విజయ­పురి­సౌత్‌లోని పాత బస్టాండ్‌ ఎదురుగా రూ. 5 కోట్లతో 30 పడకల ఆసు­పత్రి శరవేగంగా నిర్మాణం జరుగుతోంది. 2021లో ఈ భవనానికి  శంకుస్థాపన జరిగింది. తర్వాత సంవత్సర కాలం పైగా కరోనా కారణంగా పనులు నిలిచిపోయాయి. దీంతో తాత్కా­లికంగా పక్కనే ఓ ప్రభుత్వ భవనంలో వైద్యులు సేవలు కొన­సాగిస్తు­న్నారు.

ఓ పక్క పక్కా భవనం సిద్ధమవు­తున్నా పట్టించుకోకుండా ఈనాడు పత్రిక కట్టు­కథలు రాసింది. ఉత్తమ స్థాయి వైద్యులు ఆసు­ప­త్రిలో పనిచేస్తూ నిరంతరాయంగా వైద్య సేవలు అందిస్తున్నారు. గిరిజన తండాలు, సుమారు 15 సమీప గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చే పేషెంట్లు కూడా ప్రభు­త్వ సేవలపై సంతృప్తి వ్యక్తం చేస్తు­న్నారు. ఒక్క రామోజీకి మాత్రమే సేవలు కానరాక అక్కసు వెళ్లగక్కారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ ఆసు­పత్రి విషయంలో ఏమాత్రం పరిజ్ఞానం లేని లోకేశ్‌ విమర్శలు చేయడాన్ని స్థానిక నేతలు తప్పుబడు­తున్నారు.

కమ్యూనిటీ ఆసుపత్రిగా చాలా కాలంగా సేవలు అందిస్తున్న విజయపురిసౌత్‌ ఆసు­పత్రి భవనాలు శిథి­లమైతే నాడు–నేడు కింద నిధులు కేటాయించా­లని ప్రభుత్వ విప్‌ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సీఎం వైఎస్‌ జగన్‌ను కోరారు. దీనిపై స్పందించిన సీఎం జగన్‌ రూ. 5 కోట్లు కేటాయించారు. 30 పడకల ఆసు­­పత్రి నిర్మాణం చేపట్టటంతోపాటు 8 మంది వైద్యులు, ఓ రేడియోగ్రాఫర్, ముగ్గురు సెక్యూ­­రిటీ సిబ్బంది, 10 మంది శానిటరీ సిబ్బంది, ఓ జూని­యర్‌ అసిస్టెంట్, ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీసు సబా­ర్డినేట్‌ను నియమించే విధంగా నిర్ణయం తీసు­కు­­న్నారు. ఈ విధంగా చుట్టుపక్కల తండాలు, గ్రామా­లకు మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వం చర్యలు చేపడు­తుంటే ఈనాడుకు కనిపించలేదు.

డిసెంబర్‌ ఆఖరుకల్లా కొత్త భవనం 
ఇప్పటికే ఆసుపత్రి నిర్మాణంలో 90 శాతం పనులు పూర్త­య్యాయి. డిసెంబర్‌ నెలాఖరు కల్లా ఆసుపత్రిని ప్రజలకు అందుబాటులోకి తెస్తాం. ప్రస్తుతం నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు చెందిన రెండు ప్రభుత్వ గృహాలలో ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నాం. సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటూ సేవలు అందిస్తున్నారు.  – కేపీ చారి, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ మెడికల్‌ ఆఫీసర్‌.

మరిన్ని వార్తలు