కంపించిన నాయనబావి

19 Dec, 2021 08:58 IST|Sakshi
భూప్రకంపనలకు బీటలు వారిన ఇంటి గోడ

బి.కొత్తకోట (చిత్తూరు): చిత్తూరు జిల్లా బి.కొత్తకోట మండలం నాయనబావిలో శనివారం మధ్యాహ్నం 3.00 నుంచి 3.15 గంటల మధ్య భూ ప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భీకరమైన శబ్దాలు వినిపించటంతో ఇళ్లలో, దుకాణాల్లో ఉన్న వారంతా భయాందోళనతో రోడ్లపైకి పరుగులు తీశారు. ఎందుకు శబ్దాలు వస్తున్నాయో అర్థం కాక చాలా భయపడిపోయామని, తర్వాత గమనిస్తే ఒకరిద్దరి ఇళ్ల గోడలు బీటలు వారాయని స్థానికులు తెలిపారు. ఈ విషయాన్ని వారు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

చదవండి: చింతపల్లి @ 5.6 డిగ్రీలు

మరిన్ని వార్తలు