థాయ్‌లాండ్‌కు చంద్రబాబు.. అంత రహస్యమెందుకో?

29 Dec, 2021 10:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు థాయ్‌లాండ్‌ విహార యాత్రకు వెళ్లారు. కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ నెల 24న ఆయన హైదరాబాద్‌ నుంచి బయలుదేరి వెళ్లారు. జనవరి 2 వరకు అక్కడే కుటుంబంతో గడిపి తిరిగి వస్తారని టీడీపీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ పర్యటన గురించి ఎవరికీ తెలియకుండా చంద్రబాబు జాగ్రత్తపడ్డారు.

వెళ్లిన తర్వాత కూడా 2 రోజుల వరకు ఆయన కోటరీకి తప్ప ఎవరికీ తెలియనీయలేదు. వరుసగా 10 రోజులపాటు చంద్రబాబు అందుబాటులో ఉండరని పార్టీ కార్యాలయం సమాచారమివ్వడంతో ఆయన విహారయాత్ర గురించి బయటకు పొక్కింది. రహస్యంగా ఉంచాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

చదవండి: (నాడు ‘పార్టీలేదు బొక్కాలేదు’.. నేడు చంద్రబాబు గుట్టు రట్టు చేసిన అచ్చెన్న)

మరిన్ని వార్తలు