చంద్రగ్రహణం.. 12 గంటల పాటు తిరుమల ఆలయం మూసివేత

8 Nov, 2022 08:38 IST|Sakshi

సాక్షి, తిరుమల: నేడు సంపూర్ణ చంద్రగ్రహణం. గ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. మంగళవారం ఉదయం 8:40 గంటలకు ఆలయ ద్వారాలను టీటీడీ మూసివేయనుంది. తిరిగి రాత్రి 7:20 గంటలకు మహాద్వారాలు తెరుచుకోనున్నాయి. సుమారు 12 గంటలపాటు తిరుమల ఆలయం మూసివేయనుంది. రాత్రి 8 గంటలకు శ్రీవారి దర్శనం పున:ప్రారంభం కానుంది. మరోవైపు.. టీటీడీ అధికారులు వీఐపీ, ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు. కాగా, చంద్రగ్రహణం సందర్భంగా శ్రీశైలం ఆలయాన్ని కూడా మూసివేస్తున్నారు. ఆలయం తిరిగి సాయంత్రం 6:30 గంటలకు తెరుచుకోనుంది. 

మరిన్ని వార్తలు