చినజీయర్‌ స్వామికి టీటీడీ చైర్మన్‌ పరామర్శ

14 Sep, 2020 08:34 IST|Sakshi

సాక్షి, తిరుమల: శ్రీత్రిదండి చినజీయర్‌ స్వామిని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆదివారం హైదరాబాద్‌లో పరామర్శించారు. శుక్రవారం రాత్రి చినజీయర్‌ స్వామి మాతృమూర్తి అలిమేలుమంగ తాయారు పరమపదించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి జీయర్‌ ఆశ్రమానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. ఆయన మాతృమూర్తి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు.   

మరిన్ని వార్తలు