సూపర్బజార్(కొత్తగూడెం): జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రక్రియను శనివారం ప్రారంభించారు. బీఎల్ఓ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఓటరు స్లిప్పులు పంపిణీ చేస్తున్నారు. సోమవారం వరకు ఈప్రక్రియ కొనసాగించనున్నారు. ఓటర్లు ఎన్నికల సంఘం ప్రకటించిన 15 రకాల గుర్తింపు కార్డులలో ఏదో ఒక దానిని వెంట తీసుకెళ్లి ఓటుహక్కు వినియోగించుకోవచ్చు. పంపిణీ చేస్తున్న ఓటరు స్లిప్పుల్లో పోలింగ్ కేంద్రం పేరు, ఓటరు జాబితాలో క్రమసంఖ్య ఉంటుంది. ఓటరు స్లిప్పును ఓటు కలిగిన వారికే అందజేస్తున్నారు. ఓటర్లు ఎవరైనాఇంటివద్ద లేకుంటే కుటుంబ సభ్యులకు అందజేసి సంతకం తీసుకుంటున్నారు. స్లిప్పుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించారు.
ప్రత్యేక బార్కోడ్..
ఓటరు స్లిప్పుల్లో ఈసారి నూతనంగా బార్కోడ్ ఏర్పాటు చేశారు. దానిని స్కాన్ చేస్తే పోలింగ్ కేంద్రం సమాచారం తెలుస్తుంది. పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో లొకేషన్తో పాటు ఓటరుకు సంబంధించిన అన్ని వివరాలు కనిపిస్తాయి.