దేశీయ స్టాకమార్కెట్లు బుధవారం ఉదయం 9:30 సమయానికి లాభాల్లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ 0.22 శాతం లాభంతో 20,900 మార్కును తాకింది. సెన్సెక్స్ 224 పాయింట్లు లాభపడి 69,520కు చేరింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.35 వద్దకు చేరింది.
సెన్సెక్స్30 సూచీలో ఏషియన్ పెయింట్స్, యాక్సిస్ బ్యాంక్, సన్ఫార్మా, పవర్గ్రిడ్, నెస్లే ఇండియా, హెచ్సీఎల్ టెక్, ఎస్బీఐ, ఐటీసీ, ఎంఅండ్ఎం, విప్రో షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
అమెరికాలో అక్టోబర్కు సంబంధించిన ఉద్యోగ నియామక గణాంకాలు మంగళవారం వెలువడ్డాయి. జాబ్ ఓపెనింగ్స్ అంచనాల కంటే తక్కువ స్థాయిలో నమోదయ్యాయి. దీంతో వచ్చే ఏడాది ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గించక తప్పదనే సంకేతాలు బలపడ్డాయి. ఫలితంగా అక్కడి స్టాక్ మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. ఆసియా మార్కెట్లు నేడు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బ్యారెల్ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ ధర 1.1 శాతం కుంగి 77.20 డాలర్లకు చేరింది. విదేశీ సంస్థాగత మదుపర్లు మంగళవారం రూ.5,223.51 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు కూడా రూ.1,399.18 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు. ప్రస్తుత స్థాయుల కంటే ఇంకా మార్కెట్ పెరుగుతోందని నిపుణులు భావిస్తున్నారు. ఎఫ్ఐఐలు మార్కెట్ను దాదాపు 60 పాయింట్లు షార్ట్చేసినట్లు తెలిసింది. ఈ షార్ట్కవరింగ్లో భాగంగా ఇటీవల ఎఫ్ఐఐలు ఈక్వీటీల్లో ముదుపుచేస్తున్నట్లు సమాచారం. దాంతో అంతర్జాతీయంగా ఎలాంటి అనిశ్చితి లేనట్లయితే మార్కెట్లు ఇంకా పెరుగుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి.