టాటా సఫారీ డార్క్‌ ఎడిషన్‌

18 Jan, 2022 08:39 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: టాటా మోటార్స్‌ ప్రీమియం ఎస్‌యూవీ సఫారీ డార్క్‌ ఎడిషన్‌ను ప్రవేశపెట్టింది. ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ.19.05 లక్షల నుంచి ప్రారంభం. బుకింగ్స్‌ మొదలయ్యాయని, అన్ని డీలర్‌షిప్‌ కేంద్రాల్లో ఈ వాహనం అందుబాటులో ఉందని కంపెనీ సోమవారం తెలిపింది. ఆరు వేరియంట్లలో లభిస్తుంది. 

ఫీచర్లు
2.0 లీటర్‌ టర్బో డీజిల్‌ ఇంజన్, తొలి, రెండవ వరుసల్లో వెంటిలేటెడ్‌ సీట్స్, ఎయిర్‌ ప్యూరిఫయర్, 6 స్పీడ్‌ మాన్యువల్, ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్, 6/7 సీట్లు, 18 అంగుళాల అలాయ్‌ వీల్స్, 8.8 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్, జేబీఎల్‌ ఆడియో, వైర్‌లెస్‌ చార్జర్, పనోరమిక్‌ సన్‌రూఫ్‌ వంటి హంగులు ఉన్నాయి. కస్టమర్లకు డార్క్‌ శ్రేణి ఒక ప్రముఖ ఎంపికగా మారిందని కంపెనీ వివరించింది. హారియర్‌ డార్క్‌ ప్రజాదరణ పొందిందని తెలిపింది. గతేడాది నుంచి ఇప్పటి వరకు 16,000 సఫారీ ఎస్‌యూవీలు రోడ్డెక్కాయి.
 

మరిన్ని వార్తలు