వ్యూ నుంచి ప్రీమియం ఫీచర్లతో టీవీలు

28 Mar, 2023 00:35 IST|Sakshi

హైదరాబాద్‌: వ్యూ టెలివిజన్స్‌ 2023 ఎడిషన్‌ ప్రీమియం టీవీలను మార్కెట్లోకి విడుదల చేసింది. అధునాతన ఫీచర్లతో, బ్రైట్‌ డిస్‌ ప్లేతో, చక్కని సౌండ్‌ పరిజ్ఞానంతో, మంచి వీక్షణ అనుభవాన్నిస్తాయని సంస్థ ప్రకటించింది. 43 అంగుళాలు, 55 అంగుళాల సైజులో టీవీలను తీసుకొచ్చింది.

(ఇదీ చదవండి: 7 నెలల పసికూన: దిగ్గజాలను ఢీకొంటోంది!)

వీటిల్లో ఏప్లస్‌ గ్రేడ్‌ 400 నిట్స్‌ అధిక బ్రైట్‌నెస్‌తో కూడిన ఐపీఎస్‌ డిస్‌ప్లే ఉంటుందని తెలిపింది. గూగుట్‌ టీవీ ఓఎస్‌తో, 50 వాట్‌ ఇన్‌బిల్ట్‌ సౌండ్‌బార్‌తో వస్తుందని పేర్కొంది. 43 అంగుళాల ధర రూ.23,999, 55 అంగుళాల టీవీ ధర రూ.32,999. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, వూటీవీస్‌ డాట్‌ కామ్‌ స్టోర్‌ నుంచి కొనుగోలు చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.   (జాక్‌ మా రిటర్న్స్‌: చిగురిస్తున్న కొత్త ఆశలు, షేర్లు జూమ్‌

మరిన్ని వార్తలు