5 రోజుల్లో 2 పెళ్లిళ్లు.. ఇద్దర్నీ వదిలి పరార్‌!

21 Dec, 2020 17:14 IST|Sakshi

భోపాల్‌ : ఐదు రోజుల వ్యవధిలో రెండు పెళ్లిళ్లు చేసుకుని, ఇద్దరు భార్యల్ని వదిలి పరారయ్యాడో వ్యక్తి. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని కాంద్వాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఇండోర్‌కు చెందిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఈ నెల 2న కాంద్వాకు చెందిన ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి కూతురు తల్లిదండ్రులు కట్నంగా పది లక్షల రూపాయలు, పెళ్లి సామన్లు ఇచ్చారు. పెళ్లి తర్వాత తాను భోపాల్‌ వెళుతున్నానని చెప్పి, అతడు కాంద్వానుంచి ఇండోర్‌కు వచ్చేశాడు. ( తోటి నర్సుల బాత్రూం వీడియోలు ప్రియుడికి..)

డిసెంబర్‌ 7న అక్కడ మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లికి వెళ్లిన మొదటి భార్య బంధువు అతడి ఫొటోలు తీసి పంపింది. దీంతో మొదటి భార్య కుటుంబం అతడిపై కేసు పెట్టింది. రెండో భార్యను దీని గురించి అడగ్గా.. అది పెద్దలు కుదిర్చిన వివాహమని, బలవంతమేమీ లేదని చెప్పింది. అయితే రెండో వివాహం జరిగిన వెంటనే అతడు పరారయ్యాడు. ఫోన్‌ను కూడా స్విచ్ఛాఫ్‌లో పెట్టుకున్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు