సాక్షి, హైదరాబాద్ : నగరంలో చోరీలకు పాల్పడుతున్న ఇరానీ గ్యాంగ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముగ్గురు సభ్యులున్న ఈ గ్యాంగ్ను శనివారం అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మహ్మద్ హుస్సేన్, వహీద్ రాజాబ్, నజీర్ అభిదిలనుంచి 811 యూఎస్ డాలర్స్, రూ.35 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలో ముగ్గురు నిందితులపై 5 కేసులు నమోదయ్యాయి.