Kukatpally: వ్యభిచార గృహంపై దాడి.. నలుగురు అరెస్ట్‌

30 Oct, 2021 08:56 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేశారు. కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీకాలనీలోని రోడ్డు నెంబర్‌ 4లో ఎంఐజీ గృహాన్ని అద్దెకు తీసుకున్న బి.రాజు (52), నూర్‌పాషా కాసింబీలు వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారు. ఇక్కడికి ఓ మహిళను రప్పించి గుట్టుచప్పుడు కాకుండా విటులను ఆకర్షిస్తూ వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
చదవండి: యూట్యూబ్‌లో నేర్చుకుని.. వయసు 17.. మోసాలు 16

సమాచారం అందుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు గురువారం ఆకస్మికంగా దాడి చేసి నిర్వాహాకులిద్దరితో పాటు మహిళను, శేరిలింగంపల్లికి చెందిన విటుడు కృష్ణారెడ్డిలను అదుపులోకి తీసుకున్నారు. 
చదవండి: పెళ్లయిన నాటి నుంచి గొడవలే.. తట్టుకోలేక..

మరిన్ని వార్తలు