వరంగల్‌లో రౌడీ షీటర్ దారుణ హత్య

30 Aug, 2023 07:30 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: వరంగల్‌లో రౌడీ షీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. శివనగర్‌కు చెందిన నజీర్‌ను రాడ్డు, రాళ్లతో కొట్టి చంపారు. హత్యకు గల కారణాలు స్పష్టంగా తెలియకపోయినప్పటికి ఇంట్లో నిద్రిస్తున్న నజీర్‌పై పది మంది దాడి చేసి హత్య చేయడం కలకలం సృష్టిస్తుంది.

నజీర్ పదిమంది వర్కర్‌లను పెట్టుకుని రైల్వేలో సమోసాలు, పల్లి పట్టీలు విక్రయించే క్యాంటీన్ నిర్వహిస్తున్నాడు. ఇటీవల వర్క్ చేసే వారిలో ఒకరు స్వయంగా సమోసాలు చిరుతిండ్లు విక్రయిస్తుండడంతో వారితో గొడవ జరిగినట్లు సమాచారం. ఈ కారణంగానే నజీర్ హత్య జరినట్లు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. పరారైన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
చదవండి: అక్క అనుమానాస్పద మృతి.. చెల్లెలి అదృశ్యం.. ఏం జరిగింది?

మరిన్ని వార్తలు