ప్రభుత్వ భూములు పరిశీలించిన కలెక్టర్‌

1 Jan, 2024 05:12 IST|Sakshi

బంజారాహిల్స్‌: ఫిలింనగర్‌లోని పద్మాలయా అంబేడ్కర్‌ నగర్‌, బంజారాహిల్స్‌లోని జహీరానగర్‌, తెలంగాణ భవన్‌ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలాలను ఆదివారం కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి పరిశీలించారు. షేక్‌పేట తహశీల్దార్‌ అనితారెడ్డి, రెవిన్యూ అధికారి శ్రీనివాస్‌రెడ్డి, సర్వేయర్‌తో కలిసి ఆయన విలువైన సర్కారు జాగాలు పరిశీలించారు. వాటి ప్రస్తుత పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఎంత స్థలం ఉందో వాటి వివరాలు అడిగారు. ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా చూడడం, వాటిని పరిరక్షించడమే లక్ష్యంగా పనిచేయాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు.

>
మరిన్ని వార్తలు