సాయి పీఠాన్ని సందర్శించండి

1 Jan, 2024 05:12 IST|Sakshi
గవర్నర్‌కు ఆహ్వాన పత్రిక అందజేస్తున్న గోపాలకృష్ణానంద స్వామిజీ
గవర్నర్‌ తమిళిసైని ఆహ్వానించిన పీఠాధిపతి

మీర్‌పేట: కార్పొరేషన్‌ పరిధి ప్రశాంతిహిల్స్‌లోని ద్వారకామయి సాయిబాబా పీఠాన్ని సందర్శించాలని పీఠాధిపతి శ్రీ గోపాలకృష్ణానంద స్వామిజీ గవర్నర్‌ను ఆహ్వానించారు. ఈ మేరకు ఆదివారం ఆయన రాజ్‌భవన్‌లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి సత్కరించి ఆహ్వానపత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ.. ఆహ్వానానికి గవర్నర్‌ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. స్వామీజీ వెంట బీజేపీ తమిళనాడు ఇన్‌చార్జి, పార్టీ కోర్‌ కమిటీ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, స్వామిజీ కుమారుడు లలిత్‌సాయికుమార్‌ ఉన్నారు.

>
మరిన్ని వార్తలు