బైడెన్‌కు అండగా భారతీయ డాక్టర్‌

10 Nov, 2020 08:48 IST|Sakshi

సాక్షి,వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌ దేశంలో కరోనా వైరస్‌ నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన నిపుణుల బృందానికి నేతృత్వం వహించే అవకాశం భారతీయ అమెరికన్‌ డాక్టర్‌కు లభించింది. ఈ ‘కోవిడ్‌–19 టాస్క్‌ ఫోర్స్‌’కు నియమించిన ముగ్గురు అధ్యక్షుల్లో భారతీయ అమెరికన్‌ వైద్యుడు డాక్టర్‌ వివేక్‌ మూర్తి ఒకరు. డాక్టర్‌ డేవిడ్‌ కెస్లర్, డాక్టర్‌ మార్సెల్లా నునెజ్‌ స్మిత్‌ కూడా ఈ టాస్క్‌ఫోర్స్‌కు నేతృత్వం వహిస్తారు.

కరోనాను కట్టడి చేసే సమగ్ర కార్యాచరణను ఈ టాస్క్‌ ఫోర్స్‌ బైడెన్‌కు అందిస్తుంది. కరోనాను కట్టడి చేసేందుకు ప్రత్యేకంగా నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు బైడెన్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సలహా బృందంలో భారతీయ అమెరికన్‌ అతుల్‌ గావండే, లూసియానా బోరియొ, రిక్‌ బ్రైట్‌  ఉన్నారు. డాక్టర్‌ వివేక్‌ మూర్తి 2014 నుంచి 2017 వరకు అమెరికా 19వ సర్జన్‌ జనరల్‌గా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించారు.        (ఇవే బైడెన్‌ ప్రాథమ్యాలు..!)

మరిన్ని వార్తలు