జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలో ఉద్యోగులు ఒక్కరూ అందుబాటులో ఉండటం లేదని 35వ డివిజన్ కౌన్సిలర్ జయశ్రీ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల విధుల పేరిట ఎగనామం పెడుతున్నారని, ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు కూడా ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదని పేర్కొన్నారు. కిందిస్థాయి ఉద్యోగులు కూడా ఎలక్షన్ కోడ్ ఉందని, కౌన్సిలర్ల ఫోన్లు లిఫ్ట్ చేయొద్దని చెబుతున్నారని వివరించారు. ప్రజల పనులన్నీ మరుగున పడుతున్నాయని పేర్కొన్నారు. కార్యాలయానికి ఎప్పుడొచ్చినా తాళం వేసి ఉంటోందని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
● కలెక్టర్కు వార్డు సభ్యురాలు జయశ్రీ ఫిర్యాదు