రాయికల్/సారంగాపూర్: నిరుపేదల సంక్షేమమే ల క్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెడుతున్నారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి సంజయ్కుమార్కు మ ద్దతుగా ఆమె సారంగాపూర్తోపాటు రాయికల్ మండలంలోని మైతాపూర్, ఇటిక్యాల, తాట్లవాయి, కట్కాపూర్, అల్లీపూర్లో రోడ్షో నిర్వహించారు. రాయికల్బస్టాండ్, గాంధీచౌక్ ఏరియాల్లో మాట్లాడుతూ.. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకొస్తుందని, బీడీ కార్మికులందరికీ షరతులు లేకుండా పింఛన్లు మంజూరు చేస్తామని తెలిపారు. అన్నపూర్ణ పథకం కింద సన్నబియ్యం, ఆసరా పింఛన్లు రూ. 5వేలకు పెంపు, దివ్యాంగులకు రూ.6 వేలు, రైతుబంధు రూ.16వేలకు పెంపు, సౌభాగ్యలక్ష్మీ కింద రూ.3వేలు, గ్యాస్ సిలిండర్ రూ.400కే అందిస్తామ ని తెలిపారు. 60ఏళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులు, మహిళలకు చేసిందేమిటో చెప్పాలన్నారు. ఎమ్మెల్సీ జీవన్రెడ్డి తన 30 ఏళ్ల పరిపాలనలో ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని సవాల్ విసిరారు. సంజయ్కుమార్ను భారీ మెజార్టీ ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ జీవన్రెడ్డి చేయని అభివృద్ధిని తాను ఐదేళ్లలో చేశానన్నారు. ఎమ్మెల్సీ రమణ మాట్లాడుతూ నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడేది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
తండాలను కలిపి పంచాయతీ చేయిస్తా..
బీర్పూర్లోని ఆసునూరిగూడెం, కట్టకింద నాయికపుగూడెం, లంబాడి తండాలను కలిపి గ్రామపంచా యతీగా ఏర్పాటు చేయిస్తానని కవిత గిరిజనులకు మామీ ఇచ్చారు. బీర్పూర్కు మంజూరైన గురుకులాన్ని ఇక్కడికే తీసుకురావడానికి కృషిచేస్తానన్నా రు. మండలకేంద్రంలో డబుల్రోడ్డుగా మార్చడాని కి చర్యలు తీసుకోవాలని యువకులు కోరగా.. అంగీకరించారు. జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్, రాయికల్ ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి, జెడ్పీటీసీ జాదవ్ అశ్విని, మున్సిపల్ చైర్మన్ మోర హన్మండ్లు, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి, కౌన్సిలర్లు, సారంగాపూర్లో కేడీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ ము ప్పాల రాంచందర్రావు, మాజీ జెడ్పీటీసీ కొల్ముల రమణ పాల్గొన్నారు.
అభివృద్ధిపై చర్చకు సిద్ధమా..?
జగిత్యాల:జగిత్యాలలో జీవన్రెడ్డి చేసిన అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. జిల్లాకేంద్రంలో ప్రచారంలో పాల్గొన్నారు. 30ఏళ్లలో జీవన్రెడ్డి చేసింది శూన్యమన్నారు.
ప్రతిఒక్కరికీ జీవనభృతి అందిస్తాం
జీవన్రెడ్డి ఏం అభివృద్ధి చేశారు..?
ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత