బనశంకరి: కారు డ్రైవరు అదుపు తప్పడంతో చోటుచేసుకున్న వరుస ప్రమాదాల్లో ముగ్గురు గాయపడ్డారు. ఈఘటన నగరంలో హుళిమావు పరిధిలో జరిగింది. బన్నేరుఘట్ట నివాసి, కారు డ్రైవరు అగర్వాల్ ఆదివారం సాయంత్రం జిగిణి నుంచి బెంగళూరుకు కారులో బయలుదేరాడు. బన్నేరుఘట్ట రోడ్డు కాళేన అగ్రహార వద్ద ఓ వ్యక్తి ఆకస్మాత్తుగా అడ్డం రావడంతో బ్రేక్వేసే బదులు ఎక్స్లేటర్ తొక్కాడు.
దీంతో కారు వేగంగా దూసుకెళ్లి ముందు వెళుతున్న మూడు బైకులను ఢీకొట్టి రోడ్డు డివైడరును ఢీకొని నిలిచిపోయింది. ఈ దుర్ఘటనలో భర్తతో కలిసి బైక్పై వెళ్తున్న స్మిత అనే మహిళకు తీవ్ర గాయాలు, కిరణ్, మోమ్సిన్ అనే ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. బాధితులు ఆస్పత్రిలో చేరారు. కారు డివైడర్లోకి చొచ్చుకుపోయినా డ్రైవర్ క్షేమంగా బయటపడ్డాడు. హుళిమావు ట్రాఫిక్ పోలీసులు అగర్వాల్ ను అదుపులోకి తీసుకున్నారు.