పెన్షన్లు మింగేస్తున్న పోస్టుమ్యాన్‌

22 Nov, 2023 01:46 IST|Sakshi
పోస్టాఫీసు ముందు ధర్నా చేస్తున్న గ్రామస్తులు

దొడ్డబళ్లాపురం: ప్రభుత్వం నుంచి వస్తున్న వృద్ధాప్య పెన్షన్లు, ఇతర పథకాల ద్వారా లబ్ధిదారులకు వచ్చే డబ్బులను పోస్టుమ్యాన్‌ స్వాహా చేస్తున్నాడని ఆగ్రహించిన బాధితులు పోస్టాఫీసును ముట్టడించి ధర్నా చేశారు. ఈ సంఘటన కనకపుర తాలూకా వెంకటరాయనదొడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామస్తులు మాట్లాడుతూ పోస్టుమ్యాన్‌ రమేశ్‌ వృద్ధాప్య పెన్షన్లు, ఇతర పథకాల ద్వారా వస్తున్న డబ్బులను లబ్ధిదారులకు ఇవ్వకుండా జేబులో వేసుకుంటున్నాడని వాపోయారు. డబ్బులు అడిగితే అప్పుడు, ఇప్పుడు అని చుట్టూ తిప్పుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఇచ్చినా కొంత నగదు పట్టుకుని ఇస్తున్నాడన్నారు. పోస్టుమాస్టర్‌ విజయ్‌కుమార్‌ స్పందిస్తూ పై అధికారులతో చర్చించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.

మరిన్ని వార్తలు