వరద బాధితుల కోసం లక్షల విరాళమిచ్చిన యంగ్ హీరో

10 Dec, 2023 16:45 IST|Sakshi

దళపతి విజయ్‌.. రాజకీయాల్లోకి రావడం తన వ్యక్తిగత కోరిక అని, ఎవరు వచ్చినా సుపరిపాలన అందిస్తే బాగుంటుందని.. అలాంటి వాళ్లే పాలిటిక్స్‌లోకి రావాలని యంగ్ హీరో హరీశ్ కల్యాణ్‌ అన్నాడు. తాజాగా 'పార్కింగ్‌' మూవీతో థియేటర్లలోకి వచ్చాడు. ఈ క్రమంలోనే తమిళనాడు వ్యాప్తంగా థియేటర్లని సందర్శిస్తున్నాడు. 

ఈరోడ్‌లోని అన్నా థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి హీరో హరీశ్ కల్యాణ్ తన మూవీ చూశాడు. తమిళ యాక్టర్స్.. వర్ష ప్రభావ బాధితులకు వీలైనంత సాయం చేస్తున్నారని చెప్పాడు. వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతు సాయంగా లక్ష రూపాయలు, 'పార్కింగ్‌' మూవీ టీమ్ తరఫున రూ.2 లక్షలు ఇచ్చినట్టు హరీస్‌ చె‍ప్పుకొచ్చాడు.

(ఇదీ చదవండి: సెన్సార్ పూర్తి చేసుకున్న సలార్.. పిల్లలకు థియేటర్లలోకి నో ఎంట్రీ!)

>
మరిన్ని వార్తలు