విశాఖ: మహిళపై టీడీపీ నేత యాసిడ్‌ దాడి

10 Dec, 2023 16:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విశాఖపట్నం: విశాఖలో టీడీపీ నాయకుడు రెచ్చిపోయారు. మహిళపై టీడీపీ నేత నర్సింగరావు యాసిడ్‌ దాడికి పాల్పడ్డాడు. పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

నర్సింగరావు.. టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అనుచరుడు. ఈనెల 7వ తేదీన మధ్యాహ్న సమయంలో ఈ ఘటన జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి: ఎల్లో మీడియా బరితెగింపు.. చెత్త కథనాలతో బ్లాక్‌మెయిల్‌?

>
మరిన్ని వార్తలు