Adivi Sesh : పాన్‌ ఇండియా స్థాయిలో 'గూఢచారి-2'.. స్పెషల్‌ వీడియో రిలీజ్‌ చేసిన శేష్‌

29 Dec, 2022 16:42 IST|Sakshi

టాలీవుడ్‌ యంగ్‌ హీరో అడివి శేష్‌ ప్రస్తుతం వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది 'మేజర్‌', 'హిట్‌'-2లతో బ్లాక్‌ బస్టర్‌ విజయాలు అందుకున్న శేష్‌ తాజాగా తన నెక్ట్స్‌ మూవీని అనౌన్స్‌ చేశాడు. శేష్‌ కెరీర్‌లో టర్నింగ్‌ పాయింట్‌గా నిలిచిన గూఢచారి చిత్రం ఎంత పెద్ద హిట్‌ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ చిత్రానికి సీక్వెల్‌తో రాబోతున్నట్లు ప్రకటించాడు.

వినయ్ కుమార్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి శేష్‌ స్వయంగా కథ, స్క్రీన్ ప్లే అందించనున్నారు.  జీ2 టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్‌మీదకి వెళ్లనుంది. ఈ నేపథ్యంలో జనవరి 9న ముంబై అండ్‌ ఢిల్లీలో మూవీ గ్రాండ్‌ లాంఛ్‌ ఉండనున్నట్లు శేష్‌ తెలిపాడు. పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియజేయనుంది.

మరిన్ని వార్తలు