Ankita Thakur: మిసెస్ ఇండియా గ్లోబ‌ల్ ఫైనల్స్‌కు అంకిత..

8 Apr, 2023 20:33 IST|Sakshi

పెగాసిస్ వారు నిర్వ‌హిస్తోన్న 'మిసెస్ ఇండియా గ్లోబ‌ల్' ఫైన‌ల్స్‌కు సెల‌క్ట్ అయ్యారు సినీన‌టి అంకిత ఠాకూర్. ఈ నెల 11న కేర‌ళలోని కొచ్చిలో ఫైన‌ల్స్ జ‌ర‌గ‌నున్నాయి. ఈ సంద‌ర్భంగా తెలంగాణ నుంచి మిసెస్ ఇండియా గ్లోబ‌ల్‌కు సెల‌క్ట్ అయిన అంకిత ఠాకూర్ శనివారం నాడు ఫిలించాంబ‌ర్‌లో పాత్రికేయుల స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో `మిస్ ఏసియా` ర‌ష్మి ఠాకూర్‌, తెలంగాణ ఫిలించాంబ‌ర్ ఛైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా అంకిత ఠాకూర్ మాట్లాడుతూ...``తెలంగాణకు ప్రాతినిధ్యం వ‌హిస్తూ మిసెస్ ఇండియా గ్లోబ‌ల్ ఫైన‌ల్స్‌కు చేరుకోవ‌డం చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్ర‌జ‌లంతా ఓటింగ్ ద్వారా నాకు స‌పోర్ట్ చేస్తార‌ని కోరుకుంటున్నా. కొచ్చిలో ఈ నెల 11న `మిసెస్ ఇండియా గ్లోబ‌ల్`  ఫైన‌ల్స్ జ‌రగ‌నున్నాయి` అన్నారు. `మిస్ ఏసియా`, తెలంగాణ మా అసోసియేష‌న్ ప్రెసిడెంట్ ర‌ష్మీ ఠాకూర్ మాట్లాడుతూ... 'పెగాసిస్ వారు కండ‌క్ట్ చేస్తోన్న `మిసెస్ ఇండియా గ్లోబ‌ల్ ` ఫైన‌ల్స్‌కు చేరుకున్న అంకిత ఠాకూర్ నాకు క‌జిన్ అవుతారు. గ‌త కొంత కాలంగా త‌న‌కు నేను ట్రైనీగా ఉన్నాను. క‌చ్చితంగా త‌ను `మిస్ ఇండియా గ్లోబ‌ల్` క్రౌన్ గెలుచుకుని వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంది.  మ‌న తెలంగాణను రిప్ర‌జెంట్ చేస్తోన్న అంకిత ఠాకూర్ కి ఓటింగ్ ద్వారా తెలంగాణతో పాటు తెలుగు ప్ర‌జ‌లంతా స‌పోర్ట్ చేయాల‌ని కోరుకుంటున్నా`` అన్నారు.

తెలంగాణ ఫిలించాంబ‌ర్ చైర్మ‌న్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ‌గౌడ్ మాట్లాడుతూ...``గ‌తంలో మిస్ ఏసియా టైటిల్ గెలుచుకున్న ర‌ష్మీ ఠాకూర్‌కు మా తెలంగాణ ఫిలించాబ‌ర్ ఎంతో స‌పోర్ట్ చేసింది. ఇప్పుడు అంకిత ఠాకూర్‌కు కూడా ఫుల్ స‌పోర్ట్ ఉంటుంది`` అన్నారు.

మరిన్ని వార్తలు