Kartik Aaryan: హీరోకు ఖరీదైన స్పోర్ట్స్‌ కారు గిఫ్టిచ్చిన నిర్మాత

24 Jun, 2022 19:12 IST|Sakshi

హిట్లులేక అల్లాడిపోతున్న బాలీవుడ్‌కు 'భూల్‌ భులాయా 2' సినిమాతో ఆక్సిజన్‌ అందించాడు హీరో కార్తీక్‌ ఆర్యన్‌. ఈ చిత్రం ఇప్పటివరకు రూ.184.32 కోట్లు రాబట్టింది. సినిమా రిలీజై నెల రోజులు దాటిపోయినా ఇప్పటికీ పలు థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. 'భూల్‌ భులాయా 2' బ్లాక్‌బస్టర్‌ హిట్‌ సాధించడంతో దర్శకనిర్మాతలు పండగ చేసుకుంటున్నారు. ఈ ఆనందంలో నిర్మాత భూషణ్‌ కుమార్‌ హీరోకు అత్యంత ఖరీదైన బహుమతినిచ్చాడు.

మెక్‌లారెన్‌ జీటీ అనే స్పోర్ట్స్‌ కారును గిఫ్టిచ్చాడు. దీని ఖరీదు దాదాపు రూ.4.7 కోట్లు ఉంటుందని అంచనా! ఇండియాలో ఈ కారు సొంతం చేసుకున్న ఏకైక వ్యక్తిగా కార్తీక్‌ నిలిచాడు. 'కష్టానికి ప్రతిఫలం ఇంత పెద్దదిగా ఉంటుందనుకోలేదు. నేనిప్పుడు ఇండియాలోనే మొట్టమొదటి మెక్‌లారెన్‌ జీటీ యజమానిని. నెక్స్ట్‌ టైం ప్రైవేట్‌ జెట్‌ గిఫ్ట్‌ ఇవ్వండి సర్‌' అంటూ కారు ముందు దిగిన ఫొటోలను కార్తీక్‌ ఆర్యన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. అతడికి ఇదివరకే మినీ కూపర్‌, లంబోర్గిని ఉరుస్‌ కార్లు ఉన్నాయి.

కాగా కార్తీక్‌ ఆర్యన్‌, భూషణ్‌ కుమార్‌ల మధ్య ఆప్యాయత ఇప్పటిది కాదు. 2018లో సోనూకీ టీటుకీ స్వీటీ సినిమాతో వీరి కాంబినేషన్‌ మొదలైంది. ప్రస్తుతం భూల్‌ భులాయా సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న వీరు అల వైకుంఠపురములో సినిమా హిందీ రీమేక్‌ 'షెహజాదా'కు కలిసి పని చేస్తున్నారు.

A post shared by Viral Bhayani (@viralbhayani)

A post shared by Viral Bhayani (@viralbhayani)

చదవండి: కరోనా బారిన పడ్డ నందమూరి బాలకృష్ణ
రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై అనుచిత ట్వీట్‌, స్పందించిన వర్మ

మరిన్ని వార్తలు