భయం.. అత్యాశ.. కుట్ర

16 Sep, 2023 02:03 IST|Sakshi
వంశీ, ఆనంద్‌ దేవరకొండ, ఉదయ్, అనురాగ్‌

ఆనంద్‌ దేవరకొండ హీరోగా ఉదయ్‌ శెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ‘గం..గం.. గణేశా’.  కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించిన ఈ చిత్రం టీజర్‌ని రిలీజ్‌ చేశారు. ఈ వేడుకలో ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘భయం, అత్యాశ, కుట్ర అంశాల చుట్టూ ఈ సినిమా కథనం సాగుతుంది.

‘బేబీ’ తో ఆడియన్స్‌ ఎంత ఎమోషనల్‌ అయ్యారో, ‘గం..గం..గణేశా’ చిత్రంతో అంత ఎంటర్‌టైన్‌ అవుతారు. ఉదయ్‌ కథ, విజన్‌ను నమ్మి ఈ సినిమా చేశాను’’ అన్నారు. ‘‘ఈ సినిమా విజయంపై మాకు పూర్తి నమ్మకం ఉంది’’ అన్నారు వంశీ కారుమంచి. ‘ప్రేక్షకులకు నచ్చే చిత్రం ఇది’’ అన్నారు ఈ చిత్ర సహనిర్మాత అనురాగ్‌ పర్వతనేని. 

మరిన్ని వార్తలు