-

గీతాంజలి మళ్లీ వస్తోంది

27 Nov, 2023 02:57 IST|Sakshi

అంజలి టైటిల్‌ రోల్‌లో, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్‌ రెడ్డి కీలక పాత్రల్లో నటించిన హారర్‌ కామెడీ ఫిల్మ్‌ ‘గీతాంజలి’ (2014) హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అంజలి, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్‌ రెడ్డి, ‘షకలక’ శంకర్‌ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ‘నిన్నుకోరి’, ‘నిశ్శబ్దం’ సినిమాలకు వర్క్‌ చేసిన కొరియోగ్రాఫర్‌ శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

రచయిత, నిర్మాత కోన వెంకట్‌ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్‌ కార్పొరేషన్  సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్, ఊటీ నేపథ్యాల్లో ఈ సినిమా కథనం సాగుతుంది. ‘‘ఇప్పటి వరకు 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో జరగనున్న ఊటీ షెడ్యూల్‌తో ఈ సినిమా షూటింగ్‌ పూర్తవుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. 

మరిన్ని వార్తలు