Jr Ntr : వారం రోజులుగా అక్కడే ఉన్నా: జూనియర్ ఎన్టీఆర్

2 Jan, 2024 07:31 IST|Sakshi

జపాన్‌లో భూకంపం రావడంపై జూనియర్ ఎన్టీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. గత వారం రోజులుగా అక్కడే ఉన్నానని ఆయన తెలిపారు. ఈ విపత్తు వల్ల ప్రభావితమైన ప్రతి ఒక్కరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు ట్వీట్ చేశారు. అలాగే ప్రతి ఒక్కరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జపాన్ ప్రజల  ధైర్యానికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్ చేశారు. 

ఎన్టీఆర్ తన ట్విటర్‌లో రాస్తూ..'జపాన్ నుంచి ఈరోజే ఇంటికి తిరిగి వచ్చా. అక్కడ భూకంపం వచ్చింది అని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నేను వారం రోజులుగా అక్కడే ఉన్నా.  ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరుకుంటున్నా. కష్ట సమయంలో జపాన్ ప్రజల  ధైర్యానికి కృతజ్ఞతలు. ఈ విపత్తు నుంచి జపాన్ ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న దేవర చిత్రంలో నటిస్తున్నారు. 

>
మరిన్ని వార్తలు